సత్యసాయి: పులివెందుల పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ అహ్మద్ కలిశారు. కదిరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను జగన్కు వివరించారు. వాణిజ్య విభాగం అధ్యక్షులు పీఎండీ షకీల్ కూడా ఈ భేటీలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.