కోనసీమ: కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సుమారు 249 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు.