AP: మండలిలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ‘రూ.వెయ్యి లోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని అన్నారు. హెరిటేజ్ 750 ఎంఎల్ నెయ్యి రిలయన్స్లో రూ.456కి దొరుకుతుంది. హెరిటేజ్లో లీటర్ ఆవు నెయ్యి రూ.608కి దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’ అని ప్రశ్నించారు. హెరిటేజ్ వెబ్సైట్ ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.