అన్నమయ్య: జిల్లా జలధార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో జిల్లా జలధార, కలెక్టర్ నిశాంత్ కుమార్ ఫొటోను షేర్ చేసిన సీఎం, ఏడాది కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. 25వ స్థానంలో ఉన్న జిల్లాను రెండో స్థానానికి తీసుకురావడంలో కలెక్టర్ కృషి కీలకమని కొనియాడారు.