WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జలగం రఘువీర్ బీచ్ వాలీబాల్ రాష్ట్ర జట్టు ప్రధాన కోచ్గా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయిని శైలజ తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు పుదుచ్చేరిలో జాతీయస్థాయి సీనియర్ బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు.