SKLM: సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన టెంక విశ్వనాథం (36) సోమవారం ఉదయం బూరగాం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొంతు క్యాన్సర్తో బాధపడుతూ… ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురై, మరోవైపు గొంతు నొప్పులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.