TG: హైదరాబాద్ హస్తినాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. బైకును, నడిచి వెళ్తున్న మరో యువకుడిని కారు ఢీకొట్టడంతో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ ECE విద్యార్థులు శివ, సందీప్ మృతిచెందారు. కారు ఢీకొని రోడ్డుపై నడిచి వెళ్తున్న మరో యువకుడు కూడా మృతిచెందాడు. కారు డ్రైవర్ తీరుపై కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.