విశాఖ: నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. భారీ వేగంతో డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమయ్యే అంశాలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.