KKD: రొయ్యల ధరలు కౌంట్ కు రూ.30 నుంచి రూ.70 వరకు తగ్గాయని కాకినాడ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని సీడ్ వల్ల రొయ్యలు తెగుళ్ల బారిన పడుతున్నాయని, ప్రభుత్వం ఇస్తానన్న విద్యుత్ సబ్సిడీ అందడం లేదని ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు రాక నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.