NLG: కనగల్ మండలం ధర్వేశిపురంలో స్వయంభుగా వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు మంగళవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళహారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందజేశారు.