నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి న్యాయశాఖ మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మందా జావళి, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుని సామాజిక న్యాయానికి చేసిన కృషిని కొనియాడారు.