AP: పోలవరం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రంపచోడవరం మండలం రంప, మర్రివాడ అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ సిబ్బంది ఇటీవల మండపేట సమీపంలో పులిని పట్టుకుని విశాఖ జూలో వదిలిపెట్టారు. ఈనెల 19న దేవీపట్నం-పాపికొండలు అభయారణ్యంలో అధికారులు పులిని వదిలారు. రామన్నవలస, రంపలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.