KKD: ఏపీ రాజధానిగా అమరావతిపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు కేవలం ఒక్క YCP మాత్రమే వ్యతిరేకించిందని జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ విమర్శించారు. శనివారం కాకినాడ TDP కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. YCPకి రాష్ట్రం పట్ల విశ్వాసం లేదని, ప్రజలు చెప్పిన బుద్ధి సరిపోదని ఆరోపించారు. ఆంధ్రుల ఆకాంక్షను పార్లమెంటు గౌరవించిందన్నారు.