SDPT: జిల్లాలోని 42 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.