నిమ్మరసం, మజ్జిగ, బత్తాయి పండ్లు, పుచ్చపండ్లు లాంటి నీరు ఎక్కువగా పండ్లను, పానీయాలను తీసుకుంటే శరీరం చల్లగా ఉండి, ఒంట్లో చక్కెర స్థాయిలు హెచ్చతగ్గులకు లోనుకాకుండా అదుపులో ఉంటాయి. దోసకాయ ముక్కలను సలాడ్గా తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. ఇలా డయాబెటిక్ బాధితులు వేసవిలో ప్రతీ రోజూ తమ డైట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.