TG: పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్-DMK కూటమి అభ్యర్థుల గెలుపు రాజ్యాంగ రక్షణకు అవసరమని పేర్కొన్నారు. TGలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, భరోసా పథకాలే తమ గ్యారంటీల అమలుకు నిదర్శనమని వివరించారు. NDA అసత్య ప్రచారాలను నమ్మవద్దని, పుదుచ్చేరి బంగారు భవిష్యత్తు కోసం హస్తం గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.