MDK: రామాయంపేటలోని దామరచెరువు చౌరస్తా వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు సదాశివనగర్ మండలం విసనపల్లి గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు స్పందించి 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.