KMM: యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, వైరా నియోజకవర్గ నాయకుడు చల్లా సతీష్కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయనను ‘ఎన్నికల పరిశీలకుని’గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలోని ఆలప్పుళ జిల్లాకు చెందిన చెంగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల వ్యవహారాలను సతీష్ పర్యవేక్షించనున్నారు.