SRPT: కోదాడ మండలం నల్లబండ గూడెం గ్రామంలో సోమవారం అనారోగ్యంతో రామారావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.