KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఎటపు సమ్మయ్య మృతి చెందగా, వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్ తాళ్ల పెళ్లి మొగిలి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండల మాజీ అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, గడ్డం ఓదెలు, గ్రామపంచాయతీ సభ్యులు దొంగల మహేష్, దొంగల శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.