NRML: రాంటేక్లో అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దుబాయ్లో ఉంటున్న భర్త పోశెట్టి నిరంతరం ఫోన్లో వేధిస్తూ, అనుమానించడంతో మనస్తాపానికి గురైన రజిత (26) మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పది రోజులుగా వేధింపులు మితిమీరడంతో పాటు, చనిపోవాలంటూ భర్త ప్రేరేపించడమే ఈ దారుణానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనాలో తేలింది. తన 3 పిల్లలు ఆనాధలయ్యారు.