కేంద్రప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కేటీఆర్ చీరకట్టుకొని బస్సు ఎక్కు.. ఏ కండెక్టర్ అన్నా టికెట్ తీసుకుంటాడేమో అడుగు అన్న రేవంత్ మాటలకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం.. చేసేదేమో సోనియమ్మ జపం అంటూ ఎద్దేవా చేశారు.
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్థిక సాయం చేశారు. ఆయన కూలీ పనికి వెళ్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయనకు అండగా ఉంటానని మాటిచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రెండు ఒకటే అయితే కేసీఆర్ బిడ్డ ఎందుకు అరెస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ బీజేపీలో చేరతారని ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. కేసీఆర్ మొదటి నుంచి ఆ పార్టీలోనే చేరతారని చెబుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈరోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. కొన్ని మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేశారు. ఈ మేనిఫెస్టోలో 23 కీలక అంశాలను ప్రాధాన్యత ఇచ్చారు. మరి అవేంటో తెలుసుకుందాం.
భానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కానంతలో ఎండలు కాస్తున్నాయి. ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచనలు ఇస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కవిత బెయిల్ పిటిషన్ తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
లోక్సభ ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల వేల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు నిషేధం విధించింది.
బీజేపీ బెదిరిస్తే భయపడుతానా.. తన వెంట నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఎలా తీసేస్తారు అని అడిగినందుకు మోడీ, అమిత్ షాలు పగబట్టి ఢిల్లీ నుంచి నోటీసులు పంపించారని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు.
పదవతరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయి. అలాగే రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్కు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు విడుదలయ్యాయి. ఫలితాల కోసం కిందున్న లింక్ను క్లిక్ చేయవచ్చు.