»Telangana Alert For Gold Buyers In Telangana Centers New Rule
Telangana: తెలంగాణలో బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. కేంద్రం కొత్త రూల్!
బంగారం ఆభరణాల కొనుగోలుపై కేంద్రం హాల్ మార్కింగ్ నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 55 జిల్లాల్లో హాల్ మార్కింగ్ పాలసీని తీసుకొచ్చింది.
hyderabad and visakhapatnam delhi gold rates on december 13th 2023
బంగారం కొనేవారికి అలర్ట్. ఇప్పుడు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇదివరకూ ఏడు జిల్లాల్లో మాత్రమే హాల్ మార్కింగ్ నిబంధన అమలులో ఉండేది. తాజాగా కేంద్రం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 55 జిల్లాల్లో హాల్ మార్కింగ్ పాలసీని తీసుకొచ్చింది.
తెలంగాణలో కొత్తగా ఐదు జిల్లాల్లో బంగారం ఆభరణాలు విక్రయించాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన అమలు ఉండేది. అయితే తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలు ఈ రూల్ అమలులోకి వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కూడా 17 జిల్లాల్లో ఈ నిబంధన అమలు అవుతోంది. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూల్, అనంతపూర్ జిల్లాల్లో ఈ రూల్ అమలులో ఉండగా తాజాగా ఆ లిస్ట్ లోకి అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు చేరాయి. 2021 నుంచి దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో ఈ హాల్ మార్కింగ్ రూల్ ను కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజూ నాలుగు లక్షల బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ జరుగుతోందని కేంద్రం తెలిపింది.