• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ అవకాశాలు

PDPL: రీజినల్ టాస్క్ సెంటర్‌లో నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ పొందే అవకాశాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష గుర్తించారు. ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలోని సెంటర్‌లో జావా, పైథాన్, సీ, సీ++, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్‌టి, మెడికల్ కోడింగ్, ఆప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సులు ఉచితంగా నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 28 లోపు నమోదు చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 10:31 AM IST

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి పత్రం

BDK: జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘం జేఏసీ నాయకులు ఇవాళ మహబూబాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో పర్యటిస్తానని సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 10:26 AM IST

త్రిపురవరంలో రాత్రివేళ పైప్‌లైన్ గుంతల మరమ్మతులు

SRPT: అనంతగిరి మండలం త్రిపురవరంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలను శనివారం రాత్రి గ్రామ పంచాయతీ సిబ్బంది పూడ్చివేశారు. గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించి, తక్షణమే స్పందించి ఈ పనులు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు.

February 22, 2026 / 10:25 AM IST

నగరంలో 9,142 ఫ్రీ లెఫ్ట్ కేసులు

HYD: నగరంలో రోడ్డు భద్రతకు ట్రాఫిక్ పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. గత 12 రోజుల్లో ఫ్రీ లెఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించిన 9,142 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం, జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ మార్గాలను బ్లాక్ చేయడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది.

February 22, 2026 / 10:24 AM IST

సోమవారం నుంచి ప్రజావాణి పునఃప్రారంభం

NRML: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి ప్రజలు హాజరై తమ వినతులు, ఫిర్యాదులు సమర్పించాలని ఆమె సూచించారు.

February 22, 2026 / 10:22 AM IST

నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కౌన్సిలర్ దిలీప్ కాలనీలో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. గత కొన్ని రోజులుగా ప్రజలు వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పందించిన కౌన్సిలర్ వీధిదీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, మౌలిక సదుపాయాల రూపకల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.

February 22, 2026 / 10:21 AM IST

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని టీఎస్ మోడల్ స్కూల్, కాలేజీలో, ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పెగడపల్లి మోడల్ స్కూల్లో ప్రభుత్వం మొదటిసారిగా ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

ఆలయానికి రూ.4,09,519 ఆదాయం

SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలోని మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 15న నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల ద్వారా రూ.4,09,519 ఆదాయం లభించినట్లు సర్పంచ్ తోడేటి రమేశ్ తెలిపారు. ఉత్సవాల అనంతరం ఆలయ ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో ఆదాయం, వ్యయాలు, మిగులు వివరాలను వెల్లడించారు. ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం విశేషంగా ఉందన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

‘పోలీస్ క్రీడల్లో జిల్లా మహిళా కానిస్టేబుల్‌కు పథకాలు’

ADB: తెలంగాణ రాష్ట్ర పోలీసు గేమ్స్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు అద్భుత ప్రదర్శన ప్రదర్శించి 400, 800 మీ. పరుగులో పూజ, యోగ కానిస్టేబుల్‌లు స్వర్ణ పథకాలు సాధించారు. 70 కిలోల క్యాటగిరిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రూప్ సింగ్ కాంస్య పతకం పొందారు. జిల్లాకు పథకాలు రావడం పట్ల SP అఖిల్ మహాజన్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 10:20 AM IST

జిన్నారంలో స్వచ్ఛందంగా మూతపడ్డ మాంసం దుకాణాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఆదివారం మాంసం దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జీవన జ్యోతిర్లింగా శివాలయ ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దల సూచన మేరకు భక్తులు మాంసాహారం వర్జిస్తూ నియమ నిష్టలు పాటిస్తున్నారు. దుకాణదారులు కూడా భక్తి భావంతో సహకరించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

February 22, 2026 / 10:19 AM IST

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ

SRCL: తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. బహుజన వీరుడు పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొన్నం తిరుపతి గౌడ్‌తో పాటు, సభ్యులు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:18 AM IST

అసభ్యంగా ప్రవర్తించిన సిహెచ్ పై కేసు నమోదు

ఖమ్మం జిల్లా ఎదులాపురంలో ఇందిరమ్మ ఇళ్ల జియో ట్యాగింగ్ కోసం వచ్చిన గృహ నిర్మాణ శాఖ ఏఈ బొమ్మకంటి లావణ్యతో అసభ్యంగా ప్రవర్తించిన సిహెచ్ భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఏఈని దూషించి, చేయి చేసుకున్నట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

February 22, 2026 / 10:17 AM IST

కలెక్టర్‌కు ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ఆహ్వానం

జనగామ మండలం ఎల్లంల గ్రామంలో నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కమిటీ సభ్యులు నేడు ఆహ్వానించారు. ఈ నెల 23న ఉదయం 9:30 గంటలకు గ్రామంలో విగ్రహావిష్కరణ మహోత్సవం జరగనుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:16 AM IST

‘ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ అభివృద్దికి కృషి’

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ అభివృద్దికి కట్టుబడి ఉంటానని కార్పొరేటర్ చిందం సత్యవతి శ్రీనివాస్ అన్నారు. డివిజన్ పరిధిలోని గౌతమేశ్వర కాలనీలో అధ్యక్షుడు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో సమగ్ర ప్రణాళికతో మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.

February 22, 2026 / 10:13 AM IST

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్ట్

PDPL: జిల్లాలో విడాకుల కేసు విచారణకు వచ్చిన నూనె పద్మపై ఆమె భర్త వెంకటేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెయింటెనెన్స్ కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించి, ఆమె ఒప్పుకోకపోవడంతో జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకెళ్లి తలపై రాయితో కొట్టి గాయపరిచాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న పద్మను కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

February 22, 2026 / 10:09 AM IST