• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రతి సోమవారం యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

VKB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఇకనుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి గత కొన్ని వారాలుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున నిలిపివేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

February 22, 2026 / 10:08 AM IST

లైన్ క్లియర్ కోసం విద్యుత్ అంతరాయం

GDWL: శాంతినగర్‌-2 33 కేవీ ఫీడర్ కింద తాకే చెట్ల కొమ్మలను తొలగించడానికి, 33/11 కేవీ రాజోలి సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్‌కి లైన్ క్లియర్ (LC) తీసుకుంటామని ఏఈ హరి శనివారం ప్రకటించారు. రాజోలి, తూర్పు, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి గ్రామాలకు ఆదివారం మధ్యహ్నం ఒంటి గంట నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 22, 2026 / 10:08 AM IST

కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై ఉత్కంఠ

BHPL: మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై అందరి దృష్టి సారించారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులకు అవకాశం దక్కనుంది. నిబంధనల ప్రకారం ఇద్దరు మైనారిటీలకు, ఒకరు మాజీ కౌన్సిలరుకు కేటాయించాలి. ఇందులో ఒక స్థానం మహిళకు రిజర్వ్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.

February 22, 2026 / 10:04 AM IST

స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది.UG, PG, Ph.Dతో పాటు దూరవిద్య కోర్సులు అందిస్తుంది.

February 22, 2026 / 10:02 AM IST

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యహ్నం 1:30 గం HYD నుంచి MHBD జిల్లాకు రానున్నారు. మ. 2:15 గంగారం మండలం రెడ్యాల గ్రామానికి వెళ్తారు. 3 గం ములుగు జిల్లాకు రానున్నారు. 3:30 దేవాదాల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 5 గంటలకు HYDకి తిరిగి వెళ్తారు.

February 22, 2026 / 10:00 AM IST

‘నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు’

ఆదిలాబాద్ పట్టణంలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కెఆర్‌కె కాలనీలో కౌన్సిలర్ రజిత రాము ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్న బోరింగులకు మరమ్మతులు చేయించారు. ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:59 AM IST

జాతీయ స్థాయికి రెండు పాఠశాలలు

KMR: జాతీయ స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) 2025-26లో భాగంగా జిల్లా నుంచి TSNR ZPHS బాయ్స్ బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలలు రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయికి నామినేట్ అయినట్లు DEO రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాల హెచ్ఎంలను ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 09:58 AM IST

జిల్లాలో నేటి మాంసం ధరల వివరాలు..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాలలో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తుండగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నారు. కోడి కిలో రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధర కాస్త తగ్గుముఖం పట్టింది. మటన్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

February 22, 2026 / 09:55 AM IST

చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

RR: మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు తాళ్లపల్లి గ్రామానికి చెందిన నందిని అనే వివాహిత నాగుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:55 AM IST

జిల్లాలో చికెన్ ధరలు ఇవే

SRCL: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 09:54 AM IST

పుష్కరిణి వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

RR: మహాశివరాత్రి జాతర సందర్భంగా సంత్ నిరంకార్ ఆధ్వర్యంలో చేవెళ్ల వెంకటేశ్వర పుష్కరిణి వద్ద శ్రమదానంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:51 AM IST

రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలిలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 09:51 AM IST

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం లేదు

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. ఆధార్ కార్డు మిస్ మ్యాచింగ్ వల్లనే బిల్లులు ఆగావని, లబ్ధిదారులు ఆపపోహలు నమ్మవద్దని అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు వస్తాయని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 09:50 AM IST

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చైర్మన్

BHPL: జిల్లా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బుర్ర కొమరయ్య నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు.

February 22, 2026 / 09:48 AM IST

శవాన్ని దోచుకున్న దొంగలు అరెస్ట్

MBNR: ప్రమాదంలో మరణించిన లేదా అపస్మారక స్థితిలో ఉన్న బాధితుల వద్ద ఉన్న నగలు, నగదును దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17 రాత్రి రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషోత్తం రెడ్డి మృతదేహంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:47 AM IST