• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు బల్దియలో గ్రీవెన్స్ కార్యక్రమం

HNK: మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజల నుంచి గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 30, 2026 / 06:58 AM IST

మురుగు కాలువతో నరకయాతన

VKB: బంట్వారం మండలం బొప్పునారం SC కాలనీలో మురుగు కాలువ సమస్య తీవ్రంగా మారింది. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలబారిన పడే ప్రమాదముందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌కు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

March 30, 2026 / 06:54 AM IST

‘అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ లక్ష్యం’

VKB: నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలకు చదవడం, రాయడం వంటి వాటిని నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్ కార్యక్రమం’ ముఖ్య లక్ష్యమని ధారూర్ మండలం రాజాపూర్ సర్పంచ్ కురువ దివ్య అన్నారు. ఆదివారం స్థానిక పాఠశాల ఆవరణంలో మహిళా సంఘం సభ్యులకు ఉల్లాస పరీక్షను నిర్వహించారు. పరీక్షకు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.

March 30, 2026 / 06:52 AM IST

వైభవంగా కోదండరాముడి రథోత్సవం

WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం (తేరు) అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

March 30, 2026 / 06:49 AM IST

నేడు నేలకొండపల్లిలో అరైవ్-అలైవ్ కార్యక్రమం

KMM: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం నేలకొండపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక శ్రీకర గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ (Arrive-Alive) పేరిట ఈ సదస్సు జరుగుతుందని ఎస్సై సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

March 30, 2026 / 06:48 AM IST

నేటి నుంచి బాలికలకు HPV వాక్సినేషన్

BHPL: క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ఇవాల్టి నుంచి బాలికలకు HPV వాక్సినేషన్ చేస్తున్నట్లు కాటారం మండల వైద్యాధికారి మౌనిక తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు బాలికలు మాత్రమే తీసుకోవాలని, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు.

March 30, 2026 / 06:46 AM IST

11,193 కేసుల పరిష్కారం: సీపీ

SDPT: శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,193 కేసులను పరిష్కరించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇందులో 733 ఐపీసీ, 7,995 డీడీ, 2,465 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయన్నారు. కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం చేకూరడంతో పాటు కోర్టులపై భారం తగ్గిందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పోలీసు సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు.

March 30, 2026 / 06:40 AM IST

నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!

NZB: జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ యువకుడు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు. సదరు యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడు అక్బర్​ బాగ్ ప్రాంతానికి చెందిన అక్షయ్‌గా పోలీసులు గుర్తించారు.

March 30, 2026 / 06:40 AM IST

‘అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలి’

KMR: 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై అసెంబ్లీలో హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ ఏర్పాటు చేయకపోతే సభలో ఇదే విధంగా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చలు జరిగేలా సభా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

March 30, 2026 / 06:40 AM IST

డాక్టర్లపై దాడులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

NLG: నిర్మల్ పట్టణంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) నీలగిరి బ్రాంచ్ నల్గొండ సభ్యులు ఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

March 30, 2026 / 06:37 AM IST

ఏఎంసీ మాజీ చైర్మన్ మృతి బాధాకరం-మాజీ ఎమ్మెల్యే

MDK: ఏఎంసీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంట రాజు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మెదక్ లోని గంట రాజు నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

March 30, 2026 / 06:33 AM IST

‘ఈనెల 31న ముత్తారంలో స్పెషలిస్ట్ వైద్య శిబిరం’

PDPL: ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 31 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులచే ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ తెలిపారు. గైనిక్, ఆర్తో, పీడియాట్రిక్, డెంటల్, కంటి, జనరల్ సమస్యలకు వైద్యం అందిస్తారని తెలిపారు. కావున ప్రజలు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్‌తో హాజరు కావాలని సూచించారు.

March 30, 2026 / 06:32 AM IST

నేడు ‘తై బజార్’ వేలం పాట

NRPT: దామరగిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి తై బజార్ (సంత పన్ను వసూలు) వేలం పాట సోమవారం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వేలం దారులు, గ్రామ పెద్దలు ఉదయం 10:30 గంటలకు పంచాయతీ కార్యాలయానికి చేరుకోవాలని కార్యదర్శి రాఘవ సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

March 30, 2026 / 06:32 AM IST

ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

NRPT: మద్దూరు మండలం ధంగాన్పూర్ గ్రామంలో మామిళ్ల నరేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభుత్వ గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఈ వేడుకకు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్దన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 06:28 AM IST

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పారిశుద్ధ్యం

GDWL: శాంతినగర్ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 24వ రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కమిషనర్ ఎస్. రాజయ్య ఆధ్వర్యంలో 7వ వార్డులో డ్రైనేజీల పూడికతీత, 8వ వార్డులోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పరిసరాలను శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు.

March 30, 2026 / 06:27 AM IST