NZB: బాల్కొండ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్యాకెజ్ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి గురువారం తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించరన్నారు.
NGKL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు రేపు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు. వేరుశనగ, మొక్కజొన్న, కందులు ఇతర ధాన్యాన్ని అమ్మేందుకు తెచ్చే రైతులు గమనించాలని ఆయన కోరారు. తిరిగి వ్యవసాయ మార్కెట్ శనివారం యథావిధిగా మార్కెట్ కొనసాగుతుందని ఆయన అన్నారు. రైతులు సహకరించాలని కోరారు.
SRPT: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల ఇంటికే చేర్చేందుకు కోదాడ ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని డీఎం శ్రీనివాసరావు ఈ రోజు తెలిపారు. తలంబ్రాల బియ్యం కావాల్సిన భక్తులు రూ. 151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ విశిష్ట సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
SRD: కంగ్టిలోని తెలంగాణ గిరిజన సీవోఈ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డీ. విజయ్ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GDWL: ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించకపోతే కూలీలు మళ్లీ వలస బాట పట్టాల్సి వస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి అన్నారు. బుధవారం ధరూర్ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గత 8 వారాలుగా కూలీ డబ్బులు అందుక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
MDK: జిల్లా కేంద్రంలో హెచ్పీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఏజెన్సీ లేకపోవడంతో కౌడిపల్లి బ్రాంచ్ పైన, స్థానిక గోదాం పైన ఆధారపడాల్సి వస్తోంది. ఇవాళ గ్యాస్ సిలిండర్ల కోసం వందలాది మంది ఎండలో గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసి తమ కష్టాలు తీర్చాలన్నారు.
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద పట్టణానికి చెందిన ముస్లిం సమాజానికి చెందిన చోట బాయ్ నల్లాలు బిగించే పనులు చేపట్టడంతో స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. మత భేదాలు లేకుండా సామాజిక బాధ్యతతో ఈ పనులు చేయడం పట్టణంలో ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో చేసిన ఈ సేవకు పట్టణ ప్రజలు అభినందించారు.
KMR: బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, BRS పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు.
WNP: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మండలంలో పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్ సుగుణ అన్నారు. ఘణపురం మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శుక్రవారం శ్రీ రామనవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి 30న సోమవారం మార్కెట్ యథావిధిగా పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కావున రైతులు, వ్యాపారస్థులు, కార్మికులు సహకరించగలరని పేర్కొన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్ను సందర్శించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిధిలోని నేరాలు, రౌడీ షీటర్లు, పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని, పెండింగ్ కేసులపై విచారణ జరిపి, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పోలీసులను ఆదేశించారు.
VKB: కమిషన్ ఏజెంట్లు, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తూ న్యాయం చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిషన్ ఏజెంట్ల దుకాణాలను పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ రైతులకు కొనుగోలు చేసిన ధరలు వాటి కేజీల వివరాలను స్లిప్పులు వేసి అందించాలని ఏజెంట్లకు సూచించారు.
HNK: తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు DMHO డా.అల్లం అప్పయ్య తెలిపారు. నగరంలోని IMA హాల్లో గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించగా, DMHO ప్రారంభించారు. హాజ్ వెళ్లే యాత్రికులకు అన్ని రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వ్యాక్సిన్లు ఇస్తున్నామన్నారు.
NRML: జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్న నేపథ్యంలో వారు ఈ ప్రకటన చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.
KMM: కల్లూరు మండలంలో అక్రమంగా మట్టి తోలకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ పులి సాంబశివుడు హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతి లేకుండా రోడ్లపై తిరిగే టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో ఉంటూ అక్రమార్కుల ఆట కట్టిస్తామని ఎలాంటి ఉల్లంఘనలనూ సహించబోమని స్పష్టం చేశారు.