తెలంగాణ ప్రభుత్వం పంపించిన పెండింగ్ బిల్లులకు సంబంధించిన కేసును ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అంటున్నారు.
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్పై చేయిచేసుకున్న ఘటనలో వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(Ys Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుర్తింపు సంఘం ఎన్నికలు(Elections) కూడా నిర్వహించాలంటూ హైకోర్టు TSRTCను ఆదేశించింది. మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. వారి వాదనలు విన్న కోర్టు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. గతంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని కోరింది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
విరూపాక్ష మూవీకి జనాల రెస్పాన్స్ ఎలా ఉండో చూసేందుకు థియేటర్ వచ్చిన నిర్మాత ప్రసాద్ పర్స్, డెరైక్టర్ కార్తీక్ మొబైల్ను దుండగులు దొంగిలించారు.
పొన్నియన్ సెల్వన్-2 మూవీ ప్రమోషన్లో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నారు. సినిమా రెండు పార్టులుగా తీయడానికి బాహుబలి స్ఫూర్తి అని.. జక్కన్న రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
వైఎస్ షర్మిల (YS Sharmila) ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం వీడియోలో కనిపించింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు పిలిచారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ చేసిన నాయకుల నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? కోర్టు వివరాలు అడిగింది. ఈ వ్యవహారంపై ఈనెల 28వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.
హైదరాబాద్లోని బంజారా భవన్లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ యూనిట్లను పంపిణీ చేశారు.
విజయమ్మ కూడా సహనం కోల్పోయారు. నన్నే అడ్డుకుంటారా అని మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. విజయమ్మ చెంప దెబ్బ వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ కూతుళ్లు తమపై దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నారు.
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరం. రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన వాటిని తొలగిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పడం దారుణం.
ఆమె దురుసు ప్రవర్తన.. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడడం వంటి వాటిపై షర్మిలపై పలు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై బాధిత మహిళా కానిస్టేబుల్, ఎస్సై స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సమాచారం. షర్మిల దాడికి పాల్పడడంతో పోలీస్ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆమె రాజకీయం కోసం పోలీసులపై దాడికి పాల్పడడం సరికాదని హితవు పలికాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి పూర్వ అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 99లో రెండుసార్లు, మక్తల్ నుంచి 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ రెడ్డి క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది.
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.