అమిత్షా (Amit Shah) నేటి చేవెళ్ల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ బ్రిడ్జి వద్ద దారిమళ్లించి, శంకర్పల్లి, పర్వేద ఎక్స్రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాణకర్త ఆచార్య రవ్వా శ్రీహరి (Ravva srihari) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ మలక్పేటలో ఆయన కన్నుమూశారు.
రేపటి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్తో అమిత్ షా తేనేటీ విందు కార్యక్రమం రద్దయ్యింది.
సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్ఎస్పీ (TSSP) చేతికి అప్పగించారు. 350 మందికి పైగా టీఎస్ఎస్పీ సిబ్బందితోపాటు దాదాపు 300 మంది సాయుధ రిజర్వు పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు.
రంజాన్ పర్వదినాన కమెడియన్ అలీ.. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi)ని కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్.. అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy)ని సీబీఐ విచారించింది. శనివారం సాయంత్రం రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జారీ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నానన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలో రంజాన్(Ramzan) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ(Home Minister Mahammud ali) ఇంటికి వెళ్లారు. హోం మంత్రి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రీతిది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నట్లు తండ్రి నరేందర్(Narendar) తెలిపాడు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని ఛార్జ్షీట్(Charge sheet)లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్(Princ...
తెలంగాణలో సైతం పూర్తి మెజర్టీతో గెలుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.
బెంగళూర్ భూ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బుల విషయంలో వివేకా, ఎర్ర గంగిరెడ్డి మధ్య తేడా వచ్చిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.