• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి’

VKB: రోడ్డు గుంతలు పడి నిత్యం ప్రమాదాల బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. నవాబ్‌పేట్ మండలం నుంచి ఎల్లకొండ వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలు పడి వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు గుంతలను పూడ్చి నిర్మాణం చేపట్టి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

March 5, 2026 / 01:38 PM IST

వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

WGL: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే మురళి నాయక్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:37 PM IST

జీవోలు, సర్వీస్ నిబంధనలతో టీఎస్‌యూటీఎఫ్ డైరీ

SRD: అమీన్‌పూర్‌లో టీఎస్‌యూటీఎఫ్-2026 డైరీని మండల విద్యాధికారి టి.సుధాకర్‌కు అందజేశారు. ఉపాధ్యాయులకు అవసరమైన జీవోలు, సర్వీస్ నిబంధనలు, విద్యా క్యాలెండర్‌తో రూపొందిన ఈ డైరీ ఉపాధ్యాయులకు ఉపయోగకరమని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీఎస్‌యూటీఎఫ్ ముందుంటుందని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు, మండల ఉపాధ్యక్షురాలు టి.స్వరూపరాణి ఉన్నారు.

March 5, 2026 / 01:36 PM IST

విద్యుత్ లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయం

BPHL: చిట్యాల విద్యుత్ కార్యాలయంలో జాతీయ లైన్‌మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ADE సురేందర్ మాట్లాడుతూ.. నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగేందుకు లైన్‌మెన్‌ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఎండ, వర్షం అనే తేడా లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు.

March 5, 2026 / 01:35 PM IST

ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు

MNCL: కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో గురువారం స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. సర్పంచ్ సింధూజ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా DLPO సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు బ్యాంకు ప్రారంభించామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పంచాయతీ నుంచే మార్పు మొదలు కావాలని పిలుపునిచ్చారు. ఉపసర్పంచ్ చంద్రకళ, కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:34 PM IST

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

NRML: గ్రామాల్లో ప్రతిరోజూ మెరుగైన పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేల చూడాలన్నారు.

March 5, 2026 / 01:33 PM IST

‘గొప్పలు తప్ప ఆచరణలో విఫలం’

NLG: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుభరోసా పథకంపై గొప్పలు చెప్పుకుంటున్నవ్పటికీ, ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. రైతులకు పెట్టుబడులు లేక అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

March 5, 2026 / 01:30 PM IST

జిల్లాలో జోరుగా అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్న కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాలలో ఉన్నత అధికారులకు ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలని వినతి పత్రాలు అందజేసిన ఏ మాత్రం స్పందించడం లేదని అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

March 5, 2026 / 01:30 PM IST

మార్చి 15న కాన్షీరాం జయంతి సభ

SRCL: బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా ఈ నెల 15న సిరిసిల్లలో సుమారు 5000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఈ నెల 6న కామాక్షి బ్యాంకెట్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కమ్మెట అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, పాల్గొన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

నలుగురు విద్యార్థుల గైర్హాజరు

NZB: ధర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్, ఆదర్శ కళాశాలల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ పరీక్షలకు మొత్తం 4 విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాసులు తెలిపారు. ఆదర్శ కళాశాలలో ఒకరు, ప్రభుత్వ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు రాలేదని పేర్కొన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం ఆదేశాల మేరకు నూతనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సమ్మద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన భీమ్ భరత్

RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని భీమ్ చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఈరోజు శంకర్‌పల్లి మండల పరిధిలో చందిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు అన్ని పథకాలు అందుతాయని అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్, నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:29 PM IST

అనంతగిరిపల్లిలో కలియతిరిగిన మున్సిపల్ వైస్ ఛైర్మన్

VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి పదో వార్డులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి గురువారం పర్యటించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు తదితర అంశాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి పరిస్థితిని వివరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.

March 5, 2026 / 01:28 PM IST

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

PDPL: ధర్మారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 38 మంది లబ్ధిదారులకు 38,04,408 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం అందజేశారు. పేద ఆడపిల్లలకు ఈ పథకం వరం, సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:27 PM IST

మహబూబాబాద్ నుంచే ఇద్దరు రాజ్యసభ సభ్యులు

MHBD: జిల్లాకు రాజకీయంగా అరుదైన గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఖరారు కావడంతో జిల్లాకు కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం మరింత పెరిగింది. ఇప్పటికే వద్దిరాజు రవిచంద్ర BRS తరఫున 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే జిల్లాలో చెందిన వారు ఎంపిక కావడంలో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

March 5, 2026 / 01:26 PM IST