• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బకాయిల చెల్లించాలని రైతులు ధర్నా

MHBD: గంగారం మండలం పెద్దఎల్లాపురంలో 234 మంది రైతులు, తమ మొక్కజొన్న ధాన్యంను పీఏసీఎస్‌లో అమ్మి రెండు నెలలు దాటిన ఇప్పటివరకు చెల్లింపు అందకపోవడంతో గురువారం రోడ్డుపై ధర్నా చేశారు. రైతుల బకాయిల మొత్తం సుమారు 5 కోట్లు అయ్యాయి. పెండింగ్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం కోరారు,లేకపోతే అప్పుల వడ్డీలు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 03:06 PM IST

కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లిన సర్పంచ్

BDK: మణుగూరు ప్రభుత్వ దవాఖానాను సందర్శించే నేపథ్యంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ అంకిత్‌ను సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పంచాయతీలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

March 5, 2026 / 03:06 PM IST

గోదావరి పుష్కరాల కమిటీలో అడ్లూరికి చోటు

JGL: గోదావరి – 2027 పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (G.O.Rt.No.319) ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను సభ్యులుగా నియమించారు.

March 5, 2026 / 03:05 PM IST

పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు

NRML: మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వెల్మల మధు వృక్ష శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గురువారం మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏ విధంగా వ్రాయాలి అనే అంశాలపై వివరించారు. విద్యార్థులు పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా చదివి జవాబులు రాయాలన్నారు.

March 5, 2026 / 03:02 PM IST

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ రాజర్షిషా

ADB: అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వాటిని పరిష్కరించాలని.. అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పన్నారు.

March 5, 2026 / 03:02 PM IST

విద్యార్థులే టీచర్లైనా వేళ!

SDPT: తొగుట మండలం చందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ప్రధానోపాధ్యా యులు సిద్ధేశ్వర్ మాట్లాడుతూ.. సమాజానికి దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులేనని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

March 5, 2026 / 03:02 PM IST

‘పేదల భూములు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి’

SGR: పేదల భూములు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పేదల భూములను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 5, 2026 / 03:01 PM IST

లబ్ధిదారుకు CMRFచెక్కు అందజేత

SRD: కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) గ్రామానికి చెందిన శాంతపురం చంద్రకళ శంకర్‌కు ముఖ్యమంత్రి సహాయానిధి ద్వారా మంజూరైనా రూ.15 వేలు చెక్కును రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఖేడ్‌లోని ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. పేదల ఆసుపత్రి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో మాసాన్ పల్లి కృష్ణ ఉన్నారు.

March 5, 2026 / 03:01 PM IST

హైవేపై కందికల్లం.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

BHNG: మోత్కూర్-తిరుమలగిరి నేషనల్ హైవేపై రైతులు కంది కల్లం పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా వాహనాలు వెళుతుండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు అక్కడ కంట్రోల్ కాక, వన్ సైడ్ వెళ్లలేక ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కందులు తూర్పార పడుతుండటంతో పొట్టు వాహనదారుల కళ్లలో పడుతుంది. పోలీసులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.

March 5, 2026 / 03:00 PM IST

మద్నూర్‌లో ఇంటర్‌ పరీక్షలకు 98.37 శాతం హాజరు

KMR: మద్నూర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథ్స్, జువాలజీ తదితర పరీక్షలకు మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 242 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. నలుగురు విద్యార్థులు గైర్హాజరు కావడంతో 98.37 శాతం హాజరు నమోదైంది. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పటిష్ఠమైన నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

March 5, 2026 / 03:00 PM IST

‘నోటీసుల పేరుతో పోలీసులు వేధింపులు ఆపాలి’

WNP: నోటీసుల పేరుతో పోలీసుల వేధింపులు ఆపాలని గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఏదుల మండలం గొల్లపల్లి గేటు వద్ద రిజర్వాయర్ నిర్మించోద్దని చేస్తున్న నిరసన దీక్ష గురువారానికి 67వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణంతో 1200 ఎకరాల సాగు భూమి నీట మునిగి వందలాది రైతులు జీవనాధారం కోల్పోతారన్నారు.

March 5, 2026 / 03:00 PM IST

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన దైద రవీందర్

NLG: హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను నకిరేకల్‌కు చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించారు. ఆయన వెంట జిల్లా నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.

March 5, 2026 / 03:00 PM IST

‘ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలి’

SRPT: అనంతగిరి మండలం చనుపల్లి గ్రామ శివారులో పాలేరు వాగులో ఇసుక అక్రమ త్రవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా దళారులు ఇసుక తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని వెంటనే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

March 5, 2026 / 03:00 PM IST

రేపు నిజామాబాద్ రానున్న ఈటల రాజేందర్

NZB: మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం నిజామాబాద్‌కు రానున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుఫున గెలిచిన కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి పాల్గొననున్నారు.

March 5, 2026 / 03:00 PM IST

‘మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి’

KMM: ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు నాగేశ్వరరావు అన్నారు. గురువారం చింతకాని మండలం నాగులవంచ రైతు వేదికలో సొసైటీ సీఈఓ శ్రీనివాసరావుకు ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

March 5, 2026 / 02:54 PM IST