WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారులతో చర్చించారు. వార్డులో పాడైపోయిన బోర్లు, బావులను త్వరితగతిన మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి అందించాలని అధికారులకు ఆదేశించారు.