MDK: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కొత్తగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
RR: కొత్తూరు మున్సిపాలిటీలో ఇంటి పన్నులు తగ్గించాలని యువ నాయకుడు రవీందర్ యాదవ్, కొత్తూరు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇంటి పన్నుల భారాన్ని భరించలేక పోతున్నారని, మున్సిపాలిటీలో ఇంటి పన్నులు తగ్గించి ఎన్ఆర్ఈజీఎస్ కూలీ పనులు మున్సిపాలిటీలకు వర్తింపజేయాలని కోరారు.
ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా శాఖల వారీగా సమీక్షించి, నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
BHNG: బాల్య వివాహల నిర్మూలన కొరకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ ప్రచార రథం మోత్కూరు మండల కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవింద రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మార్వో జ్యోతి హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
KNR: పురపాలక పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని పేర్కొన్నారు. సోమవారం ఆమె 1వ వార్డులో పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మేకల స్వరూప పాల్గొన్నారు.
KMM: ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. MAR 6 నుంచి JUN 12 వరకు ప్రభుత్వ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరితని సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ నూతన పాలకవర్గం వైస్ ఛైర్మన్, BRS కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
KMR: జిల్లాలో తాజాగా విడుదలైన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్ ఫలితాల్లో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సాయికుమార్ నీలావర్ ఉత్తీర్ణత సాధించారు. ఆయన తండ్రి మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున నీలావర్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేసి ఈ విజయాన్ని సాధించినట్లు సాయి తెలిపారు.
PDPL: జూలపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి కాచాపూర్ గ్రామం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైతిక విలువలతో, ప్రజల పట్ల అంకితభావంతో సేవలందించిన నాయకుడు శ్రీపాద రావు అని స్మరించుకున్నారు.
NLG: దివంగత శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చంద్రశేఖర్, పలువురు అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
SRPT: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 83 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్ దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
SRCL: జిల్లా కలెక్టరేట్ సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 164 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణ శాఖకు 25, జిల్లా పంచాయతీ కార్యాలయం, డీఆర్డీఓకు 13 చొప్పున, సంక్షేమ శాఖకు- 09, ఉపాధి కల్పన శాఖకు – 08, వచ్చాయన్నారు.
BHNG: అడ్డగూడూర్ మండలం అజీంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కన్నేబోయిన ఎలేందర్ కుమారుడు కిరణ్ వివాహం సందర్బంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు లింగాల మధు గౌడ్, చిరంజీవి, రాకేష్ పాల్గొన్నారు.