అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరితని సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ నూతన పాలకవర్గం వైస్ ఛైర్మన్, BRS కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.