KMR: బంజారాహిల్స్లోని తన కుటుంబ సభ్యులు, మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డిలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి కలిసి హోళీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలన్నారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
KNR: కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: మండల కేంద్రంలో కేవలం ముందస్తు బుకింగ్ చేసుకున్న రైతులకే యూరియా పంపిణీ చేస్తున్నారు. అయితే నిమిషాల్లోనే స్టాక్ అయిపోవడంతో సామాన్య రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని యూరియా బస్తాలను అందుబాటులోకి తేవాలని, స్టాక్ వివరాలను ముందే తెలియజేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. పంపిణీ సక్రమంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
SRPT: అనంతగిరి మండలం పాలవరంలోని పురాతన బాల ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ఆర్ఎ రవి సుమారు రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించారు. బుధవారం సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ స్లాబ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మికతకు రవి అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NZB: ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడింది. ఆటో ప్రమాదవశాత్తు కెనాల్లో పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: కాంగ్రెస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రత్యేక ఆటో బడ్జెట్ హామీని వెంటనే అమలు చేయాలని దేవరకద్ర ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రాము డిమాండ్ చేశారు. ఈనెల16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని కోరారు. లేకపోతే ఆటో డ్రైవర్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సభ్యులు రాజు, శేఖర్, నవీన్, కొండారెడ్డి, భీమాచారి తెలిపారు.
BHNG: గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను బొంధుగుల సర్పంచి పయ్యావుల ఎల్లయ్య గ్రామ పెద్దలు కోరారు. బుధవారం ఆయనను కలసి గ్రామంలోని సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య, ఉపసర్పంచ్ అబిద్ వార్డు సభ్యుడు శీను, రమేష్, గ్రామస్తులు సిద్దులు, రాజు, రాములు, కిషన్, కనుకయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
NRPT: నార్త్ కరోలినాలో జూలై 17–19 జరగనున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TATA) కాన్ఫరెన్స్కు మంత్రి వాకిటి శ్రీహరిని ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో టాటా ప్రతినిధుల బృందం ఆయనను కలిగి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.
SDPT: అక్కనపేట మండలంలోనీ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా ట్రైనర్లు సభ్యులకు పాలనా విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సహా పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో పరిశుభ్రత, విద్య, వైద్యం వంటి వాటిపై తరగతులు నిర్వహించారు.
KMM: కూసుమంచి మండలం మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పాలేరు ఉద్యాన అధికారి పి.అపర్ణ తెలిపారు. మార్చి మాసంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ప్రస్తుతం కాయలు బఠానీ గింజ పరిమాణంలో ఉన్నాయని, ఈ సమయంలో నల్లమచ్చ తెగులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
PDPL: యువతకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన మంథనిలోని టాస్క్ సెంటర్ను సందర్శించారు. అవసరమైన పక్షంలో మరో భవనం నిర్మించాలన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా TGIIC ఆధ్వర్యంలో గార్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 2 ఎకరాల స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
NZB: చందూర్ మండలం వకీల్ ఫారం వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం వర్ని మండలం శంకొరా గ్రామానికి చెందిన గోపాల్ వకీల్ ఫారం వద్ద బైక్పై నుంచి పడ్డాడు. దీంతో అతని నాలుక తెగి తీవ్ర గాయాలు అయ్యాయి. చందూర్ 108 సిబ్బంది ఈఎంటీ రవి, పైలట్ వినోద్ ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ దర్గాలోని ఈద్గాలో పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని, పహాడీ షరీఫ్ డివిజన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ చంద్రకళకు పహాడి షరీఫ్ మాజీ కౌన్సిలర్ కొండల్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
VKB: విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని పరిగి షీ టీమ్ ఇంఛార్జ్ నర్సింలు సూచించారు. బుధవారం పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు కాల్ చేయాలని ఆయన కోరారు.
RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ. 40,04,640 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. మియాపూర్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.