HYD: కోఠి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జనవరి 31న కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పరార్ అవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చివరకు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
MNCL: గ్రామాలలో సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు కృషి చేయాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ సూచించారు. జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టంలోని అంశాల గురించి శిక్షకులు వారికి వివరించారు. మౌలిక సౌకర్యాల కల్పన, సమస్యల పరిష్కారం వంటివి వివరించారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అయినప్పటికీ నేటికి జిల్లాల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పార్టీ క్యాడర్లో నిరాశ నెలకొంది. అయితే మార్చిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని అనడంతో నాయకుల ఆశలు చిగురించాయి. పార్టీ పదవులు, మార్కెట్ కమిటీ, గ్రంథాలయాల ఛైర్మన్ వంటివి చాలా చోట్ల పెండింగ్లో ఉండటంతో ఎవరికి వస్తాయనేది ఆసక్తి నెలకొంది.
SRPT: హుజూర్ నగర్లో బంజారాల ఓట్లతో గెలిచి, వారికే అవకాశాలు ఇవ్వకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానిస్తున్నారని, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారికంగా నిర్వహించవలసిన సేవాలాల్ జయంతి వేడుకలను నియోజకవర్గంలో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. బంజారాలు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు.
MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ASF: రెబ్బెన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దేవులగూడ నుండి రెబ్బెన వైపు అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్న ఒక వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన SI వెంకట కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
BDK: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.
HYDలో ఎయిర్ క్వాలిటీలో ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్క్వాలిటీ మంగళవారం వట్టినగులపల్లిలో షాకింగ్గా 571గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
VKB: పరిగిలోని 11వ వార్డులో అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా కౌన్సిలర్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పర్యటించిన కౌన్సిలర్ ఎండీ అజాజ్ ఆయన మురుగునీరు నిల్వ, నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సహాయంతో నాలాలను శుభ్రపరిచి చెత్తను తొలగించే పనులు చేపట్టించారు.
WNP: వనపర్తి పాత బస్టాండ్లో తాగు నీరు, సరియైన కూర్చీలు, వేచిచూడే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు. కేవలం ఒక షెడ్డు, 4 కుర్చీలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్ బస్సులు బస్టాండ్కి రాకుండా రాజీవ్ చౌరస్తాలో ఆగి వెల్లిపోతున్నాయన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని అదికారులను కోరారు.
KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించి, ఈ నెల 27న జరిగే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ. 10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు.
JN: పాలకుర్తి (M) గూడురు గిరిజన బాలికల వసతి గృహంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. హాస్టల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేసి పసుపు, కుంకుమ, బొమ్మలు లాంటివి వేస్తున్నారని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రాత్రి సమయంలో నిద్ర కూడా పట్టడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్ వాస్తు విద్యాపీఠాన్ని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అయితే ఈనెల 26న మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రావాలని చైర్ పర్సన్ సిద్ధాంతిని ఆహ్వానించారు.
SRPT: మేళ్లచెరువులో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో జనజీవనం సంధించింది. గాలి దాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మిర్చి ఏరుతున్న దశలో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు రేపు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు.