WNP: శ్రీ రంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు.గ్రామ దేవతలను పూజించడం గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు నిర్మించడం ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
NLG:నార్కట్పల్లిలోని పీవీఆర్ చేతన పాఠశాలలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టులు అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఎగ్జామినర్ సుధాకర్ ఆధ్వర్యంలో మొత్తం 65 మంది విద్యార్థులు బెల్టులు సాధించారు.
KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. మహబూబ్ అలీ అనే వ్యక్తికి చెందిన పట్టా భూమిలో శనివారం అర్ధరాత్రి కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కోయ, ముస్లిం పూజారులతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు సమాచారం.
MBNR: హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించి ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
MDK: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డేస్ ద్వారా మాత్రమే ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించిన జరుగుతుందన్నారు. మార్చి 02 నుంచి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి జరుగుతుందని వెల్లడించారు.
SDPT: శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా అక్కన్నపేట మండలంలోని చాపగాని తండాలో గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూక్య వీరన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రిపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీఠాధిపతి మహారాజ్ తో కలిసి వీరన్న నాయక్ విచ్చేసి భోగ్ బండార్ నిర్వహించారు.
SRD: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా సంగారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
KMM: సత్తుపల్లి పట్టణం జూపల్లి రామచంద్రారావు కంటి, గుండె సంబంధించిన ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి ప్రారంభించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యానికి ఎమ్మెల్యే సూచించారు. వారితోపాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుమలత, కౌన్సిలర్ రాంబాబు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు పాల్గొన్నారు.
NRPT: కోస్గి 5వ వార్డులో కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ దాడులకు దిగుతోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లా చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదాల నివారణకు SHO సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయం, కారణాలు, నివారణ చర్యలపై వారు చర్చించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
NRML: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కడెం మండలం కొండుకూర్లో ఏర్పాటు చేసిన జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో పెరిక సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బోరజ్ మండలం మండగడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు తెలిపారు. ఆదివారం గ్రామంలోని పాఠశాలలో శ్రీకృష్ణ, శ్రీ గణేష్ ఆస్పత్రుల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారన్నారు.
GDWL: అయిజలోని పరమేశ్వర ఇండస్ట్రీస్లో జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితుడు ప్రతాపరెడ్డిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లడంపై వారు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని, అయిజలో త్వరలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.
BDK: కార్పోరేషన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన మేయర్ మూడ్ గణేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన ఈ పదవి ఒక బాధ్యతయుతంగా పనిచేసేందుకు ఉపయోగిస్తానని ఎక్కడ అవినీతికి తావులేకుండా పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. 15,173 విద్యార్థులు 34 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. 300 ఇన్విజిలేటర్లు, CC కెమెరాలు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 34 చీఫ్ సూపరింటెండెంట్స్, 6 కస్టోడియన్స్ 34 మెడికల్ ANMలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ల QR కోడ్ ద్వారా కేంద్ర వివరాలు తెలుసుకోవచ్చు.