JGL: భీమవరం మండలంలోని మోత్కురావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం అటవీ అధికారులతో సమీక్షించారు. మోత్కురావుపేట-చందుర్తి అటవీ మార్గంలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి కదలికలు ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావొద్దన్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 2025-26 వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 40 రోజుల ముందుగానే అధిగమించింది. ఈ సందర్భంగా సోమవారం కార్మికులు, సుపర్ వైజర్లను జీఎం శ్రీనివాస్ అభినందించి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఇదే ఒరవడితో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీసైదా పాల్గొన్నారు.
HYD: తమ హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదరు వెంకన్న తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా గాందేయ మార్గంలో ఈ పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
KNR: డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ, ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
MDK: నర్సాపూర్ పురపాలిక నూతన పాలకవర్గం తొలి సమావేశం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం ఉత్సాహంగా సాగింది. తొలుత కౌన్సిలర్లు, సిబ్బంది మధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.
NRPT: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో సోమవారం రజక, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం చిన్నారి ఫొటోకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిని వెంటనే చట్టరీత్యా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.
NLG: నకిరేకల్ పట్టణంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో షార్ట్సర్క్యూట్ కారణంగా దగ్ధమైన శ్రీ సాయి విఘ్నేశ్వర ఆటోమొబైల్ షాపును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. ప్రమాదంలో దుకాణానికి సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాదితుడు ఉపేందర్ తెలిపారు.ఈ సందర్భంగా షాపు యజమాని ఉపేందర్తో మాట్లాడిన ఎమ్మెల్యే ఘటన వివరాలు తెలుసుకున్నారు.
WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSF తీవ్రంగా ఖండిస్తోంది. సోమవారం వరంగల్ జిల్లా కేంద్రంలో BSF ఉమ్మడి WGL జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని చంపిన అగ్రకుల (రెడ్ల) పెత్తందార్లను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
NGKL: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అచ్చంపేట బార్ అసోషియోషన్ న్యాయవాదులు చలో హైదరాబాద్ మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు జరగడం దారుణమని బార్ అసోసియోషన్ అధ్యక్షుడు మస్తాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి, రవికుమార్, వెంకటేశ్వర్ రావు, మల్లేశ్ ఉన్నారు.
NZB: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
SDPT: సిద్దిపేట కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆందోళన చేపట్టింది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు. సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ వద్దకు విచ్చేశారు. కలెక్టరేట్ కార్యాలయ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
MLG: తాడ్వాయి(మం) కామారం క్రాస్ వద్ద సోమవారం, అతివేగంతో దూసుకొచ్చిన ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఏటూరునాగారం(మం) రామన్న గూడెం స్థానిక నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారిపై నవీన్ మృతదేహం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.
NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్న్, నాన్న్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.