• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వెన్నాచేడ్ రహదారి స్వచ్ఛత కార్యక్రమం

MBNR: గండీడ్ మండలం వెన్నాచేడ్ దుర్గమాత మైదానం లింగాయ పల్లి రహదారిలో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమం సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీబీ సహాయంతో చెత్త తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. స్థానికులు ఈ చర్యను అభినందించి రహదారిని స్వచ్ఛంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని, చెత్తను కేవలం బండిలో వేయాలని కోరారు.

March 30, 2026 / 10:47 AM IST

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

BHPL: గణపురంలోని కోటగుళ్లలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం కోటగుళ్లను భక్తులు సందర్శించి మొక్కులను చెల్లించుకున్నారు. కోటగుళ్లకు విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

March 30, 2026 / 10:46 AM IST

వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలిలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,570 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 20,600 ధర పలకగా.. వండర్ హాట్(WH) రూ. 30వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ. 19,250, ఎల్లో మిర్చి రూ. 22వేలు పలికాయి. మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

March 30, 2026 / 10:46 AM IST

LPG బుకింగ్ విషయంలో జాగ్రత్త: సజ్జనార్

HYD: గ్యాస్ సిలిండర్ బుకింగ్, KYC అప్‌డేట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై సీపీ వీసీ.సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులకు OTP లేదా బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక యాప్స్ లేదా వెబ్‌సైట్లను మాత్రమే వాడాలని ట్వీట్ చేశారు.

March 30, 2026 / 10:45 AM IST

టీచర్ లేక మూతపడిన అంగన్వాడీ కేంద్రం

SRCL: అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీర్నపల్లి (M) మద్దిమల్ల తండాలో అంగన్వాడీ టీచర్ గతేడాది మృతి చెందింది. అప్పటి నుంచి మరో టీచర్‌ను నియమించకపోవడంతో హెల్పర్‌ను భర్తీ చేస్తూ అంగన్వాడీ సెంటర్‌ను కొనసాగిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉండడంతో కేంద్రం పూర్తిగా మూత పడింది.

March 30, 2026 / 10:43 AM IST

సిరికొండలో భక్తిశ్రద్ధలతో అశ్వత్థ కళ్యాణం

NZB: సిరికొండలోని శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ మందిరంలో సోమవారం అశ్వత్థ లక్ష్మీనారాయణ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రావి చెట్టును స్వామివారిగా, వేప చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ అర్చకులు శ్రీకాంత్ పంతులు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. ప్రకృతిలోని పవిత్ర వృక్షాలకు కళ్యాణం చేయడం వల్ల లోకకళ్యాణం జరుగుతుందన్నారు.

March 30, 2026 / 10:42 AM IST

KCR, KTR లకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మాజీ MLA

MNCL: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి KCR, BRS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని KCR, KTR లకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం నియోజకవర్గ రాజకీయాలపై కాసేపు చర్చించారు.

March 30, 2026 / 10:39 AM IST

నియోజకవర్గాల పునర్విభజన అంశంతో వేడెక్కిన రాజకీయం

KNR: నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంటులో చర్చకు రావడం కరీంనగర్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సరిహద్దులు మారిపోవడం ఖాయం. దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గంలో పట్టు సాధించిన నాయకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే తమ సామాజిక సమీకరణాలు కలిసొస్తాయని మరికొందరు నాయకులు చర్చించుకుంటున్నారు.

March 30, 2026 / 10:37 AM IST

ప్రజలను వేధిస్తున్న సైబర్ కాల్స్

NLG: చెర్వుఅన్నారంలో సైబర్ కాల్స్ వేధింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం నుంచి గ్రామస్థులకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గ్రామానికి చెందిన కొందరు లోన్ తీసుకున్నారని, వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని సదరు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నారు. తమకు సంబంధం లేని విషయంపై ఫోన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 30, 2026 / 10:31 AM IST

రేపటి నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు

NGKL: పదర మండలం మద్దిమడుగులో కొలువుదీరిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఘనంగా జరగనున్నాయి. 31న శివపార్వతుల కళ్యాణం, ఏప్రిల్ 1 న సీతారాముల కళ్యాణం, హోమాలు, గరుడ వాహన సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పాలక మండలి కోరింది.

March 30, 2026 / 10:29 AM IST

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్…

BHNG: మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లు గురించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాజపేట మండలం నర్సాపురం గ్రామం మాజీ సర్పంచ్ ఎన్.గోపాల్ రెడ్డి, బేగంపేట మాజీ సర్పంచ్ పి.కరుణాకర్‌లను ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు విడుదల చేయాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అరెస్టు చేయడాని తీవ్రంగా ఖండించారు.

March 30, 2026 / 10:28 AM IST

దేశ పరిస్థితుల గురించి యువతకు తెలపాలి -DYFI

SRD: దేశంలోని చారిత్రక ఘటనలు, పరిస్థితుల గురించి యువతకు తెలపాల్సిన అవసరం పాలకులపై ఉందని DYFI కన్వీనర్ హరినాధ్ రెడ్డి అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరువు శ్రామిక భవన్‌లో ఏర్పటు చేసిన DYFI సమావేశంలో మాట్లడుతు భారతదేశానికి స్వాతంత్రం ఎంతోమంది త్యాగాల ఫలాలతో వచ్చిందని, యువత సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.

March 30, 2026 / 10:20 AM IST

దుబ్బ తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

MHBD: పాత దుబ్బ తండ గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ శ్రీను ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని, ఆరోగ్యం విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఉప సర్పంచ్ దేవు సింగ్, తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 10:19 AM IST

దంచికొడుతున్న ఎండలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

BDK: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. భద్రాద్రి కరకగూడెం లో 41.8 నమోదయింది.

March 30, 2026 / 10:19 AM IST

హనుమాన్ శోభాయాత్ర గోడ పత్రికల ఆవిష్కరణ

SDPT: నెంటూర్‌లో ఏప్రిల్ 2న నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర వాల్ పోస్టర్లను ధర్మ రక్షా కమిటీ సభ్యులు ఆదివారం విడుదల చేశారు. బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో ఈ భారీ శోభాయాత్ర జరగనుంది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులందరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

March 30, 2026 / 10:18 AM IST