• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

25లోగా రైల్వేఅండర్ పాస్ ప్రారంభించాలి

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర కల్యాణ మహోత్సవం ఈనెల 26న జరుగనున్న సందర్భంగా ఆలయ సమీపంలోని నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని 25లోగా ప్రారంభించాలని పట్టణ నాయకులు కాంట్రాక్టర్‌కు సూచించారు. శనివారం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ వెంకన్నతో కలిసి పరిశీలించారు.

February 9, 2025 / 12:10 PM IST

గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విప్

MHBD: మరిపెడ మండలం తానంచర్ల గంగమ్మ ఆలయాన్ని నేడు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు ఆలయంలో భక్తులతో కలిసి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 9, 2025 / 10:15 AM IST

కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: జిల్లా కేంద్రంలోని 22వ వార్డు బాలాజీ నగర్‌లో గల కుట్టు శిక్షణ కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకురాలు హసీనాతో శిక్షణ కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రామానంద తీర్థ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కేంద్రంను ఏర్పాటు చేశారని, నేటి వరకు 3 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణను ఇచ్చామని తెలిపారు.

February 9, 2025 / 09:58 AM IST

పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MBNR: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాషాబుగుట్ట హైస్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు, క్లాస్ రూమ్స్, వంటశాల, స్టోర్‌రూంను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన త్రాగునీరు, పరిసరాలు, భోజనంలో పరిశుభ్రత పాటించాలన్నారు.

February 9, 2025 / 09:54 AM IST

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

MLG: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు.

February 9, 2025 / 09:02 AM IST

ట్రామా సెంటర్ ఏర్పాటుకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న ట్రామా సెంటర్, స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ రెండు సెంటర్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 9, 2025 / 08:48 AM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మల్లురవి

NGKL: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క‌తో కలిసి ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావలసిన వెనుకబాటు జిల్లాల ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు.

February 9, 2025 / 08:32 AM IST

‘రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి’

PDPL: ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును మండల వ్యవసాయ అధికారి అనూష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోదాములలో నిలువలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.

February 9, 2025 / 06:44 AM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ

NGKL: కొప్పునూరు గ్రామంలో శనివారం మంత్రి జూపల్లి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ.20 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.50 లక్షల సీసీ రోడ్, వడ్డెర కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న పలు  భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీ పోచమ్మ గుడిని సందర్శించారు.

February 9, 2025 / 05:42 AM IST

లోన్‌లు ఇప్పిస్తానని మూడు కోట్లకు టోకరా

JGL: ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద కోటి రూపాయల వరకు ముద్ర లోన్‌లు ఇప్పిస్తానంటూ దాదాపు రూ.3 కోట్లు కాజేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన నిందితుడు వేణు వర్మను బాధితులు శనివారం తీన్ ఖని ప్రాంతానికి చెందిన ఓ ఇంటి వద్ద పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ స్కామ్‌లో జిల్లాలో వంద మందికి పైగా బాధితులు ఉన్నారు

February 9, 2025 / 04:07 AM IST

యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

BNGR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

February 8, 2025 / 07:18 PM IST

‘లింగ విపక్షత లేని సమాజం కొరకు మహిళలు పోరాటాలు చేయాలి’

SRPT: లింగ వివక్షత లేని సమాజం కోసం మహిళలు పోరాటం చేయాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో కౌన్సిల్ సమావేశం దంతాల పద్మ రేఖ అధ్యక్షతన జరిగింది. మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మహిళా సమాజాన్ని జాగృతం చేసేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు.

February 8, 2025 / 06:29 PM IST

గోషామహల్‌లో పర్యటించిన ఎమ్మెల్సీ

HYD: గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. అలాగే ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తీసుకుని పరిష్కరించాలని సూచించారు.

February 8, 2025 / 06:28 PM IST

‘ఈనెల 10న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి’

SRPT: కోదాడ పట్టణంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ ఫిబ్రవరి 10న హైదరాబాదులో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

February 8, 2025 / 06:16 PM IST

ఏఎస్సైగా పదోన్నతి పొందిన ఖయ్యూంకు సన్మానం

SRPT: కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్. ఖయ్యూం ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. శనివారం టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఖయ్యూం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు.

February 8, 2025 / 06:11 PM IST