• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జాంబాగ్‌లో ఉచిత వైద్య శిబిరం

HYD: జాంబాగ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

February 10, 2025 / 06:48 PM IST

చైనా ఫోన్‌లా రేవంత్ రెడ్డి పాలన: ఎమ్మెల్సీ కవిత

NZB: KCR పాలన ఐఫోన్‌లా ఉంటే రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఐఫోన్, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. KCRకు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికి బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాయ మాటలు చెప్పి బీసీలఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురిడి కొట్టించారని ధ్వజమెత్తారు.

February 10, 2025 / 06:28 PM IST

వెదురు సాగు చేసే రైతుల ఇంట సిరుల పంట: కలెక్టర్

BDK: వెదురు సాగు చేయడం వల్ల రైతుల ఇంట సిరుల పంట పడినట్టేనని జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల ఏపీఎంలు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్‌పీసీలు, వీవో ఏసీలు, అటవీ శాఖ సిబ్బందికి వెదురు పెంపకంపై శిక్షణా తరగతులు నిర్వహించారు.

February 10, 2025 / 05:17 PM IST

‘ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది’

NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లేష్, లక్ష్మి నరసింహ టెంపుల్ ఛైర్మన్ నరసింహ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 10, 2025 / 01:33 PM IST

‘జన్నారంలో 44,260 మంది ఓటర్లు’

MNCL: జన్నారం మండలంలో మొత్తం 44,260 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం మండల ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మండలంలో ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మండలంలో మొత్తం 44,260 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 21,620 పురుషులు, 22,638 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారన్నారు.

February 10, 2025 / 01:24 PM IST

‘సమస్యల పరిష్కారం కొరకే ప్రజా ఫిర్యాదుల విభాగం’

NRML: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

February 10, 2025 / 01:22 PM IST

ఖానాపూర్‌లో పర్యటించిన జిల్లా కలెక్టర్

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలో సోమవారం అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డులను తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. వీరి వెంట స్థానిక అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 10, 2025 / 12:44 PM IST

చెరువుగట్టులో భూపాల్ రెడ్డి పూజలు

NLG: నార్కట్‌పల్లి మండల పరిధిలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భూపాల్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 10, 2025 / 12:26 PM IST

అప్రెంటిషిప్ మేళాతో నిరుద్యోగులకు మేలు

MNCL: నిరుద్యోగులకు మేలు చేయడానికే అప్రెంటిషిప్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని జన్నారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బీ.రాములు అన్నారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు న్నారు.

February 10, 2025 / 12:21 PM IST

గొల్లమందల రవికి డాక్టరేట్

KMM: తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గొల్లమందల రవికి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టరేట్ బహుమతి అందించింది. రవి వృక్ష సంపద, వాటి పరిరక్షణ, అవసరాలపై పరిశోధన చేశారు. సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు నారపోగు వెంకట్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

February 10, 2025 / 10:53 AM IST

రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

WNP: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ ఫొటోగ్రాఫర్ మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చందాపూర్‌కి చెందిన అనిల్ కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వనపర్తి నుంచి చందాపూర్ వస్తుండగా మార్గమధ్యలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.

February 10, 2025 / 10:13 AM IST

మహిళలకు జాతీయ క్రీడాకారిణి నవనీత స్ఫూర్తి

వికారాబాద్: ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు జాతీయక్రీడాకారిణి నవనీత స్ఫూర్తిగా నిలవడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఇందిరానగర్ 5వ వార్డుకు చెందిన నవనీత మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జాతీయస్థాయి మహిళల విభాగంలో హైజంప్‌లో మొదటిస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.

February 10, 2025 / 07:55 AM IST

ఫిబ్రవరి 15తో ముగియనున్న నుమాయిష్

HYD: నాంపల్లిలో జనవరి 3న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల(నుమాయిష్) కొనసాగుతుంది. ఫిబ్రవరి 15తో ఈ ప్రదర్శనకు తెరపడనుందని నిర్వహకులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. కానీ HYD సీపీ సీవీ ఆనంద్ ఇందుకు నిరాకరించారు.

February 10, 2025 / 07:41 AM IST

భార్యపై కోపంతో భర్త సూసైడ్ అటెంప్ట్

HYD: సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు.

February 10, 2025 / 07:23 AM IST

ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బీజేపీదే: బండి సంజయ్

NLG: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

February 10, 2025 / 06:44 AM IST