• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మార్కెట్‌లో కొనసాగుతున్న పత్తి వ్యాపారం

KMR: మద్నూర్ మార్కెట్‌లో పత్తి వ్యాపారం కొనసాగుతుంది. సోమవారం ఉదయం నుంచి పత్తి లోడ్‌తో వాహనాలు వస్తున్నాయి. మంచి క్వాలిటీతో ఉన్న పత్తి ధర క్వింటాకు రూ.7,400, పరిగె పత్తి రూ.6,000 ధర పలుకుతుందని వ్యాపారులు తెలిపారు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో మూడు జిన్నింగ్ మిల్లులో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు.

March 30, 2026 / 08:56 AM IST

వెంకటేశ్వర్ల తండాలో సీసీ రోడ్డు పనులు

NRPT: ధన్వాడ మండలం బుడ్డమర్రి తండా పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్ల తండాలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఉపాధి హామీ (NREGS) పథకం కింద కేటాయించిన 4 లక్షల నిధులతో సర్పంచ్ అనిత, ఉప సర్పంచ్ హసలీ భాయ్ ఆదివారం భూమి పూజ చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు.

March 30, 2026 / 08:49 AM IST

చిన్నచింతకుంట లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

MBNR: జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతుంది గడిచిన 24 గంటల్లో చిన్నచింతకుంటలో 40.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.5, కోయిలకొండ (M) సిరి వెంకటాపూర్ 40.2, మహమ్మదాబాద్ 39.9, దేవరకద్ర 39.8, కౌకుంట్ల 39.7, MBNR అర్బన్ 39.5, కోయిలకొండ (M) పారుపల్లి, అడ్డాకుల 39.4, మిడ్జిల్ (M) దోనూరు 39.3 ఉష్ణోగ్రత నమోదయింది.

March 30, 2026 / 08:46 AM IST

భద్రకాళి అమ్మవారికి పంచామృతాభిషేకాలు

WGL: భద్రకాళి ఆలయం ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం భక్తులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

March 30, 2026 / 08:45 AM IST

సన్నబియ్యం పంపిణీ పథకానికి ఏడాది పూర్తి

SRPT: పేదల ఆహార భద్రత లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సన్నబియ్యం పంపిణీ’ పథకం నేటితో విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఏప్రిల్ 30న హుజూర్ నగర్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 9.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందుతున్నాయి.

March 30, 2026 / 08:45 AM IST

సీసీ రోడ్డుకు నిధులు మంజూరు

VKB: బంట్వరంలోని యాచారంలో సీసీ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో రూ.4 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామంలోని పాత బావి నుంచి సూర్యాపేట బీమ్ రెడ్డి ఇంటి వరకు ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామ ప్రజల తరఫున యాచారం గ్రామానికి చెందిన అడ్కిచర్ల దివ్యబాలకృష్ణా రెడ్డి స్పీకర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

March 30, 2026 / 08:43 AM IST

వన్నం రామారావుకు జిల్లా జనరల్ సెక్రటరీ బాధ్యతలు

MHBD: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీగా వన్నం రామారావు (బయ్యారం మండలానికి చెందినవారు) ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నరసింహరావు చేతుల మీదుగా ఆయన నియామకపత్రం అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

March 30, 2026 / 08:42 AM IST

‘నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి’

NGKL: బల్మూరు మండలం కొండనాగులలో ఉపాధి హామీ పథకంలో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నట్లు టెక్నికల్ అసిస్టెంట్ శ్యామయ్య తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను బతికించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కల సంరక్షణ కోసం వాచర్లు చురుగ్గా పాల్గొన్నారు.

March 30, 2026 / 08:41 AM IST

ఆంక్షలతో కనిపించని అభివృద్ధి

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం మండల కేంద్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. రెండు మండలాలు కవ్వాల్ అభయారణ్య పరిధిలోనే వస్తాయి. దండేపల్లి షెడ్యూల్ ప్రాంతం కావడంతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం కష్టంగా మారింది. జన్నారం మండల కేంద్రం నాలుగు జిల్లాలకు వెళ్లే సరిహద్దులో ఉన్న అటవీ ఆంక్షలతో అభివృద్ధి పనులు అటకెక్కుతున్నాయి.

March 30, 2026 / 08:40 AM IST

గ్రామ బీసీ సంఘం అధ్యక్షుడిగా గణేశ్ గౌడ్

SRCL: ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో బీసీ సాధికారిక సంఘం అధ్యక్షుడిగా గున్నాల గణేశ్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షుడు నరేందర్, స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవయ్య, ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.

March 30, 2026 / 08:39 AM IST

కళాశాలల్లో సివిల్ పనుల తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

KMM: ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజ సింగరేణి మండలంలోని విద్యాసంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న సివిల్ పనులను తనిఖీ చేసి, వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం SSC పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించారు.

March 30, 2026 / 08:36 AM IST

నిట్ డైరెక్టర్‌కు ‘ఇన్‌డా ఫెలో’ గౌరవం

WGL: వరంగల్‌లోని ఎన్ఐటీలో డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ హెచ్. సోనావనేకు ఇండియన్ డీశాలినేషన్ అసోసియేషన్ ( ఇన్‌డా ఫెలో) ‘ఫెలో’ గౌరవం లభించింది. నీటి శుద్ధికరణ(వాటర్ డిసలి నేషన్) నిర్వహణ రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇన్‌డా ఫెలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆయనను అభినందించారు.

March 30, 2026 / 08:35 AM IST

పంటను కాపాడేందుకు అన్నదాత అష్టకష్టాలు..!

NZB: సిరికొండ మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంట ఎండుతోంది. బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పందిమడుగు, చీమలపల్లి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్ట దశలో ఉన్న పైరును కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్ నీటికి రూ. 1,000 చొప్పున వెచ్చించి నీటిని అందిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పాల్పడుతున్నారు.

March 30, 2026 / 08:33 AM IST

మల్లికార్జున స్వామిని సేవలో మున్సిపల్ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు మున్సిపల్ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

March 30, 2026 / 08:33 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి అశ్వవాహన సేవ

SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ స్వాగతం పలికారు.

March 30, 2026 / 08:31 AM IST