ADB: ఉమ్మడి జిల్లా నుండి రంజీ ట్రోఫీ క్రికెట్లో ఎంపికైన కొడిమెల హిమతేజను మున్నూరుకాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి దేశవాళి క్రికెట్లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. శివన్న, సుభద్రబాయి, శంకర్, రవికాంత్, మధు, ఆడేళ్లు తదితరులున్నారు.