HYD: విద్యార్థులకు విద్యతోపాటు సృజనాత్మకత కూడా చాలా అవసరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. ఆదివారం న్యూ బోయిన్పల్లిలోని సీతారాంపురంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మంజులా వాణి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.