SDPT: మెసా జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ సందాని నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం (టీఎస్- మెసా) సిద్దిపేట జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అత్తర్ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు.
NZB: సిరికొండ మండలంలో వరి కోతలు జోరందుకున్నాయి. రావుట్ల, మైలారం, కొండూరు తదితర గ్రామాల్లో కోతలు మొదలై 15 రోజులవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రోడ్లపై, కల్లాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున, అధికారులు తక్షణమే స్పందించి కేంద్రాలను తెరిచి మద్దతు ధరకు ధాన్యం సేకరించాలన్నారు.
ADB: గ్రామీణ మహిళల విద్యాభివృద్ధికి NIOS పరీక్షలు ఎంతో అవసరమని డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్ అన్నారు. నార్నూర్లోని గోండుగూడ గిరిజన పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు విద్యపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజారామ్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
KNR : కరీంనగర్ జిల్లాలో 16 అంబులెన్సులతో 108 సేవలు అత్యవసర సేవలు పకడ్బందీగా అందిస్తున్నామని జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఆదివారం కరీంనగర్లో 108 అంబులెన్సులను ఆయన తనిఖీ చేశారు. 33 మంది సిబ్బంది, 35 మంది పైలట్లు సేవలందిస్తున్నారని, గతేడాదిలో 23,275 మందిని ఆసుపత్రులకు తరలించామన్నారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు వారిని తరలించామన్నారు.
WGL: వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. నిన్న అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. దేవాదాయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
VKB: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమయ్యే ఇసుక తరలించేందుకు మన ఇసుక వాహనం యాప్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో విశ్వప్రసాద్ తెలిపారు. పాత తాండూర్, వీర్షెట్పల్లి, చిట్టి ఘనపూర్, కాగ్న నది నుంచి ఇసుక పొందేందుకు యాప్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాక్టర్కు రూ.214 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
SRD: కంగ్టిలో సిద్దేశ్వరుడి జాతరకు మహారథం సిద్ధమవుతోంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా జాతరకు వారం రోజులు ముందుగానే రథాన్ని తయారు చేసే పనులు చేపడతారు. వచ్చే వారంలో శిఖరోత్సవం, అగ్నిగుండాలు రథోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. మండల ప్రజలే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పారు.
VKB: కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం జిల్లాలో గుడ్డు ధర రూ.3.50-రూ.4.50 మధ్య, ఇక ట్రే గుడ్లు రూ.120-రూ.140 పడిపోవడం చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
NGKL: బల్మూరు మండలం గట్టుతుమ్మెన్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ గౌడ్, గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
BDK: కిన్నెరసాని పర్యాటక కేంద్రం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 265 మంది పర్యాటకులు డ్యాం డీర్ పార్క్ను సందర్శించి సందడి చేశారు. దీని ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ. 15,635 ఆదాయం సమకూరింది. అలాగే 210 మంది పర్యాటకులు బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్కు రూ.12,860 ఆదాయం లభించింది అని అధికారులు తెలిపారు.
NLG: వాణిజ్య గ్యాస్ కొరతను నిరసిస్తూ దేవరకొండలో హోటళ్లు, వ్యాపార సంస్థల బంద్కు నిర్వాహకులు పిలుపునిచ్చారు. తోపుడు బండ్లు, టీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం జరుగుతున్న దాడులు, అధిక పన్నుల భారం తగ్గించాలని కోరారు. గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.
JN: జనగాం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ నేడు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఉపయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేను బెదిరించడం అత్యంత హేయమైన చర్య అని ఆమె అన్నారు.
PDPL: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నట్లు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 97 కు పెంచడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను, గ్రామస్తులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
JGL: అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్నారని మాజీ సర్పంచులను జగిత్యాల రూరల్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచులను జగిత్యాల రూరల్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
NZB: TU పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యను అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు నేడు సాయంత్రంలోపు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుం రూ. 100/- తో రేపటి వరకు అవకాశముందన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు.