JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రభుత్వ విప్ను ఘనంగా సన్మానించారు.