మన్యం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన చెప్పారు.