• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లబ్ధిదారు ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కు

SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన మైపాల్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 28,500 చెక్కును నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేశారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తానని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో మాజీ ఎంపీటీసీ భూపాల్ ఉన్నారు.

February 12, 2025 / 11:19 AM IST

బాధితుడుకు సీఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ

MDK: రామయంపేట మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన రాజలింగానికి సీఎం సహాయ నిధి చెక్కును మాజీ సర్పంచ్ కాముని రవీంద్ర బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితునికి మెరుగైన వైద్య నిమిత్తం రూ. 36 వేల సీఎంఆర్ఎఫ్ చెప్పిన అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

February 12, 2025 / 11:16 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

February 12, 2025 / 11:16 AM IST

కొత్తగూడెంలో ఇదీ పరిస్థితి..!

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం చేపల మార్కెట్ ఏరియాలో ఇటీవల కిన్నెరసాని పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ కోసం తవ్విన గుంటలను మట్టితో పూడ్చారు. అయితే ప్రస్తుతం ఆ పైప్ లైన్ లీకేజీ వల్ల నీరు రోడ్డుపైకి చేరి అసౌకర్యంగా మారుతోందని బుధవారం స్థానికులు చెప్పారు. గుంటలను పూడ్చిన మట్టి లీకైన నీటితో బురదమయంగా మారుతోందని తెలిపారు.

February 12, 2025 / 11:09 AM IST

నియోజక అభివృద్ధికి సహకరించండి:బాలాజీ సింగ్

NGKL: కల్వకుర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాకూర్ బాలాజీ సింగ్ కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందివ్వాలని బాలాజీ సింగ్ సీఎంని కోరారు. అనంతరం బాలాజీ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలాజీ వెంట నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

February 12, 2025 / 10:51 AM IST

ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సులో మెదక్ కలెక్టర్

MDK: ఢిల్లీలో జరిగిన పరిపాలనా సంస్కరణల అంతర్జాతీయ సదస్సుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌గా మూడు జిల్లాల్లో పనిచేసిన పాలనాపరమైన అనుభవాలను దేశ,విదేశీ ప్రతినిధులతో పంచుకున్నారు. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, భారత ప్రభుత్వ అధీనంలోని పరిపాలనా సంస్కరణల విభాగం సంయుక్తంగా సదస్సు నిర్వహించారు.

February 12, 2025 / 10:49 AM IST

‘రైతుల కళ్ళలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’

MHBD: రైతుల కండ్లలో ఆనందం చూడడమే, రైతును రాజు చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్య ఉందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, బయన్న వాగు రిజర్వాయర్‌ను రైతులతో కలిసి సందర్శించారు. అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 12, 2025 / 10:08 AM IST

మండలంలో మిర్చి బస్తాల చోరీ

KMM: మిర్చి బస్తాలను దుండగులు చోరీ చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆటోలో లోడ్ చేసిన మిర్చి బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పంట పెట్టుబడి కోసం రూ. లక్షలు అప్పుగా తీసుకొచ్చి, ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటను దుండగులు చోరీ చేశారని బాధిత రైతు వాపోయాడు.

February 12, 2025 / 09:56 AM IST

“ఫిబ్రవరి 15న సెలవు ఇవ్వాలని DEO కుTSTTF వినతి”

BDK: ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి నాడు సెలవు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారికి TSTTF జిల్లా బృందం బుధవారం వినతిపత్రం అందించారు. అదేవిధంగా కుల గణన సర్వే చేసిన టీచర్లకు రెమ్యూనరేషన్‌తో పాటు ఐదు రోజుల CCL మంజూరు చేయాలని కోరారు. TOSS 2022–24 మధ్య కాలంలో వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ELS మంజూరు చేయాలన్నారు.

February 12, 2025 / 09:55 AM IST

నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం

WGL: గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం గణపతి పూజ, పుట్ట మట్టకి వెళ్లడం, మధ్యాహ్నం హోమం కార్యక్రమం, సాయంత్రం వేళలో ఎదుర్కోలు, స్వామివారి కల్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.

February 12, 2025 / 08:15 AM IST

చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి

WNP: ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు.

February 12, 2025 / 08:10 AM IST

అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

NRML: జిల్లాలోని గోదావరి, స్వర్ణ, శుద్ధవాగు పరిసర ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఈ ప్రాంతాలపై నిఘాను పటిష్టం చేసామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లాలో 17 ఇసుక రీచ్‌లు, 35 ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ ఉంచిన రవాణా చేసిన చర్యలు తప్పవని బుధవారం ప్రకటనలో హెచ్చరించారు.

February 12, 2025 / 08:00 AM IST

హామీలు నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధం

SRD: మహిళల సంక్షేమం కోసం ఇచ్చిన పూర్తి హామీలు సత్వరమే అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని సంగారెడ్డి జిల్లా BRS  నేత చింతల గీతారెడ్డి అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ 2500, తులం బంగారం, స్కూటీ తదితర హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. మహిళా దినోత్సవంలోపల హామీలు అమలుపై కార్యక్రమం ప్రకటించకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

February 12, 2025 / 07:59 AM IST

ధర్మ పరిరక్షకులపై దాడి అమానుషం

SRD: చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి అమానుషమని సంగారెడ్డి జిల్లా వైష్ణవ సంఘం అధ్యక్షులు కందాడై వరదాచార్యులు ఖండించారు. ధర్మ పరిరక్షకులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మం న్యాయం కోసం పాటుపడే ఇలాంటి అర్చకులపై దాడి చేయడం దారుణమని ఆవేదనతో అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు.

February 12, 2025 / 07:58 AM IST

నేడు, రేపు మండలాల వారిగా ఎన్నికల శిక్షణ

SRD: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండలాల వారిగా శిక్షణ కార్యక్రమాలను ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే శిక్షణ అధికారులను మండలాల వారిగా ప్రకటించినట్లు చెప్పారు. ఆర్వో ఏఆర్వోలుగా నియామకమైన ఉపాధ్యాయులు ఆయా మండలాల్లో శిక్షణకు హాజరుకావాలని సూచించారు.

February 12, 2025 / 06:59 AM IST