SRD: మహిళల సంక్షేమం కోసం ఇచ్చిన పూర్తి హామీలు సత్వరమే అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని సంగారెడ్డి జిల్లా BRS నేత చింతల గీతారెడ్డి అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ 2500, తులం బంగారం, స్కూటీ తదితర హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. మహిళా దినోత్సవంలోపల హామీలు అమలుపై కార్యక్రమం ప్రకటించకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.