JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు.